Sunday 23 November 2014

యాగంటి

అగస్త్య ముని ఈ ప్రదేశం లో వెంకటేశ్వరస్వామి ని ప్రతిష్టించదలచారట. అయితే విగ్రహపు కాలి గోరు విరగటం తో, ఆ విగ్రహాన్ని ఒక గుహ లో ఉంచి తపస్సు చేసారంట.శివుడు ప్రత్యక్షమవగా ,నేకంటి శివుని నేకంటి అని ఆనందం తో అన్నారంట. కాలక్రమేణా అదే యాగంటి గా పిలవబడుతుందని ఒక కథనం. తన తప్పు ఏమన్నా ఉందా ?ఎందువలన  విగ్రహ ప్రతిష్ట కు భంగం కలిగిందని ప్రశ్నించగా ,శివుడు - ఈ క్షేత్రం కైలాసాన్ని తలపిస్తుంది ,కావున శివుని ప్రతిష్టించమని చెప్పారంట.అప్పుడు అగస్త్య ముని పార్వతీ సమేతం గా ఇక్కడ కొలువై ఉండవలసింది గా కోరటంతో,ఉమామహేశ్వరులు స్వయంభువులై వెలిశారు.ఇక్కడ ఒకే శివలింగం పై ఉమామహేశ్వరులు దర్శనమిస్తారు. 
ఇంకో కథనం ... చిట్టెప్ప అనే భక్తుడు కి శివుడు వ్యాఘ్ర రూపం లో కనిపించాడంట.అతడు ఆనందం తో నాట్యం చేస్తూ నేకంటి శివుని నేకంటి అని అన్నాడని ,కాలక్రమేణా అదే యాగంటి గా పిలవబడుతుందని . 
 
 
 

           

 
అగస్త్య పుష్కరిణి 
ఈ పుష్కరిణి లోకి నీరు నంది నోటి లో నుంచి వస్తుంది.అది ఎలా అన్నది ఇప్పటికీ తెలియని విషయం 
  
వెంకటేశ్వర గుహ (ఈ గుహ లోనే వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఉంచింది)
 
ఉమామహేశ్వర ఆలయ ద్వజ స్థంభం (కోతి కూడా పూజలు చేసుకుంటుంది)  

ఏ గుడి కి లేని విధం గా ,ఇక్కడ గుడి చుట్టూ ప్రాకారం నిర్మించారు.
ఈ ప్రాకారాన్ని చూసిన వెంటనే నాకు ,చైనా వాల్ గుర్తొచ్చింది :) 
 
 శంకర గుహ (వీర బ్రహ్మేంద్ర స్వామి ప్రతిష్టించిన శివలింగం ఇక్కడ పూజలు అందుకుంటుంది )
 
వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భార్య ఉపయోగించిన రోలు (జనాలు ,రోలు కు కూడా పూజలు చేస్తున్నారు )
 
ప్రభుత్వం ,ఈ గుడిని జాతీయ వారసత్వ సంపద గా గుర్తించింది.  
 
 
 యాగంటి బసవన్న (కలియుగాంతం లో రంకె వేస్తుందని బ్రహ్మం గారి కాలజ్ఞానం లో ఉంది )
 
గుడి నిర్మాణం జరుగుతున్నప్పుడు ,పని వారు రాయిని పగలకొట్టిన ప్రతిసారి తిరిగి అతుక్కుని పరిమాణం పెరుగుతూండేప్పటికి భయపడ్డారంట. శివుని ఆదేశం మేరకు స్వయానా ఆ నందీశ్వరుడు వేలిసాడంట.
ఇక్కడ ఉన్న నంది విగ్రహం చెక్కిన విగ్రహం కాదు,రాయి నంది ఆకారం దాల్చింది .
ఇప్పటికీ నంది ,పరిమాణం లో పెరుగుతూ ఉంది .     


No comments: