Saturday 30 July 2016

ఓట్స్ ఇడ్లీ





పప్పు నానబెట్టుకోవటం , కడిగి రుబ్బుకోవటం లాంటి జంజాటాలు లేకుండా ,చాలా త్వరగా చేసుకునే అల్పాహారం. రుచికి రుచి .ఆరోగ్యానికి ఆరోగ్యం . ముఖ్యం గా మధుమేహం తో బాధ పడేవారికి ...  

కావాల్సిన పదార్ధాలు :

ఓట్స్  :  కప్పు

ఉప్మా రవ్వ  : 1/2 కప్పు

పెరుగు  : 1/2 కప్పు 

పచ్చి మిరప కాయలు - 2

అల్లం తురుము : 1/2 స్పూన్ 

ఉప్పు : తగినంత 

తాలింపు కి   : నూనె ,శనగ పప్పు , ఆవాలు, జీలకర్ర ,కరివేపాకు 

చేయు విధానం : 

ఓట్స్ ,రవ్వ  విడివిడిగా నూనె వెయ్యకుండా వేయించుకోవాలి . బాండీ (బాణలి ) లో నూనె వేసుకుని , వేడెక్కగానే తిరగమాత దినుసులు వేసి అందులోనే పచ్చి మిరప కాయ ముక్కలు ,అల్లం తురుము వెయ్యాలి . పెరుగు లో ఉప్పు వేసుకుని అందులో వేయించిన ఓట్స్ ,రవ్వ , తాలింపు వేసి కలుపుకోవాలి . గట్టిగా ఉంటె కొద్దిగా నీరు పోసుకుని పలుచన చెయ్యాలి . ఇడ్లి ప్లేట్స్ లో పిండి వేసి కుక్కర్ లో (విజిల్ పెట్టకూడదు )10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించాలి . ఈ కొలతలకు 10 -12 ఇడ్లి లు తయారు అవుతాయి . కొబ్బరి చట్నీ లేదా అల్లం చట్నీ తో తినొచ్చు . 


No comments: