Sunday 23 November 2014

యాగంటి

అగస్త్య ముని ఈ ప్రదేశం లో వెంకటేశ్వరస్వామి ని ప్రతిష్టించదలచారట. అయితే విగ్రహపు కాలి గోరు విరగటం తో, ఆ విగ్రహాన్ని ఒక గుహ లో ఉంచి తపస్సు చేసారంట.శివుడు ప్రత్యక్షమవగా ,నేకంటి శివుని నేకంటి అని ఆనందం తో అన్నారంట. కాలక్రమేణా అదే యాగంటి గా పిలవబడుతుందని ఒక కథనం. తన తప్పు ఏమన్నా ఉందా ?ఎందువలన  విగ్రహ ప్రతిష్ట కు భంగం కలిగిందని ప్రశ్నించగా ,శివుడు - ఈ క్షేత్రం కైలాసాన్ని తలపిస్తుంది ,కావున శివుని ప్రతిష్టించమని చెప్పారంట.అప్పుడు అగస్త్య ముని పార్వతీ సమేతం గా ఇక్కడ కొలువై ఉండవలసింది గా కోరటంతో,ఉమామహేశ్వరులు స్వయంభువులై వెలిశారు.ఇక్కడ ఒకే శివలింగం పై ఉమామహేశ్వరులు దర్శనమిస్తారు. 
ఇంకో కథనం ... చిట్టెప్ప అనే భక్తుడు కి శివుడు వ్యాఘ్ర రూపం లో కనిపించాడంట.అతడు ఆనందం తో నాట్యం చేస్తూ నేకంటి శివుని నేకంటి అని అన్నాడని ,కాలక్రమేణా అదే యాగంటి గా పిలవబడుతుందని . 
 
 
 

           

 
అగస్త్య పుష్కరిణి 
ఈ పుష్కరిణి లోకి నీరు నంది నోటి లో నుంచి వస్తుంది.అది ఎలా అన్నది ఇప్పటికీ తెలియని విషయం 
  
వెంకటేశ్వర గుహ (ఈ గుహ లోనే వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఉంచింది)
 
ఉమామహేశ్వర ఆలయ ద్వజ స్థంభం (కోతి కూడా పూజలు చేసుకుంటుంది)  

ఏ గుడి కి లేని విధం గా ,ఇక్కడ గుడి చుట్టూ ప్రాకారం నిర్మించారు.
ఈ ప్రాకారాన్ని చూసిన వెంటనే నాకు ,చైనా వాల్ గుర్తొచ్చింది :) 
 
 శంకర గుహ (వీర బ్రహ్మేంద్ర స్వామి ప్రతిష్టించిన శివలింగం ఇక్కడ పూజలు అందుకుంటుంది )
 
వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భార్య ఉపయోగించిన రోలు (జనాలు ,రోలు కు కూడా పూజలు చేస్తున్నారు )
 
ప్రభుత్వం ,ఈ గుడిని జాతీయ వారసత్వ సంపద గా గుర్తించింది.  
 
 
 యాగంటి బసవన్న (కలియుగాంతం లో రంకె వేస్తుందని బ్రహ్మం గారి కాలజ్ఞానం లో ఉంది )
 
గుడి నిర్మాణం జరుగుతున్నప్పుడు ,పని వారు రాయిని పగలకొట్టిన ప్రతిసారి తిరిగి అతుక్కుని పరిమాణం పెరుగుతూండేప్పటికి భయపడ్డారంట. శివుని ఆదేశం మేరకు స్వయానా ఆ నందీశ్వరుడు వేలిసాడంట.
ఇక్కడ ఉన్న నంది విగ్రహం చెక్కిన విగ్రహం కాదు,రాయి నంది ఆకారం దాల్చింది .
ఇప్పటికీ నంది ,పరిమాణం లో పెరుగుతూ ఉంది .     


Thursday 20 November 2014

అహోబిలం contd.,

స్థల పురాణం ప్రకారం ,దేవతలు హిరణ్యకశ్యపుని చంపటానికి స్వామి దాల్చిన ఉగ్రరూపాన్ని కాంచి ,అహోబల అని స్తుతించారు అంట.అందువల్ల అహోబిలం/అహోబలం అనే పేరు.ఈ క్రింది శ్లోకం ఈ విషయాన్ని ధృవీకరిస్తుంది.  
 
"అహో వీర్యం,అహో శౌర్యం,అహో బాహుపరాక్రమ 
నరసింహం పరం దైవం అహోబిలం అహోబలం "
 
ఇంకో కథనం ఏమిటంటే ,గరుడ తపస్సు చేసిన గుహ వల్ల అహోబిలం అనే పేరు వచ్చింది అని. ఇక్కడ నరసింహ స్వామి గుహలో వెలిశారు. 
  
 మరుసటి రోజు ఉదయం ఆరు గంటలకల్లా బయలుదేరి ఆరున్నర కి ఎగువ అహోబిలం చేరుకున్నాము.చిన్న    జలపాతం ...

 
 గుడి ప్రవేశ ద్వారం . 
 

 గుడి తెరవటానికి ఇంకా అరగంట టైం ఉండటం తో ,కొంతమంది గుడి ముందు శుభ్రం చేసి నీళ్ళు చల్లి ముగ్గులు వేసారు. మేము నలుగురైదుగురం కొండ పైకి వెళ్లి వరాహ నరసింహ స్వామి గుడి చూసి వచ్చాము.
 
వరాహ నరసింహస్వామి గుడి కి వెళ్ళే దారి ...  
  

                                    కొండ పైన చిన్న చిన్న జలపాతాలు చాలా నే ఉన్నాయి.
   
 
 
ఈ గుడి దగ్గర ,వెళ్ళే దారిలో కోతులు గుంపులు గుంపులు గా ఉన్నాయి. కొంచం సేపు వాటి విన్యాసాలు చూసి ఆనందించాము.
దైవ భక్తి ఉన్నా ,లేకపోయినా ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించటానికైనా తప్పక వెళ్ళదగ్గది - అహోబిలం :)     
 
  

Wednesday 19 November 2014

అహోబిలం

మహానంది లో దైవదర్శనం పూర్తి చేసుకుని అక్కడే గుడి వెలుపల  భోజనాలు చేసాము.ఆ తర్వాత అహోబిలానికి బయలుదేరాము.అక్కడికి చేరేటప్పటికి సమయం 7:30గం. బస్ లో కొంతమంది ఎగువ అహోబిలం లోని స్వామి ని   దర్శించుకోకుండా  ఈ గుడికి వెళ్ళకూడదు అని అనటం తో ఎగువ అహోబిలం వెళ్ళాము.మేము వెళ్ళేప్పటికి గుడి మూసివెయ్యడం తో తిరిగి దిగువ అహోబిలం వచ్చి లక్ష్మీనరసింహస్వామి ని దర్శించుకున్నాము.ఈ గుడికి వెళ్ళే దారి లో రెండు వైపులా మంటపాలు లాంటివి ఉన్నాయి.అందులో కొన్ని శిధిలమయి ఉన్నాయి .పూర్వం వాటిని దేని కొరకు ఉపయోగించారో తెలియదు కానీ ,ప్రస్తుతం అంగళ్లు ఉన్నాయి.గుడి లోపల ప్రాంగణం లో కూడా కొన్ని మంటపాలు శిధిలావస్థ లో ఉన్నాయి.
తిరుపతి వేంకటేశ్వరస్వామి వివాహం చేసుకునే ముందు నరసింహస్వామి ఆశీస్సులు తీసుకోవటానికి ఎగువ అహోబిలం  వచ్చారంట.అక్కడ స్వామి ఉగ్రరూపంలో ఉండటంచూసి,దిగువ  అహోబిలం వచ్చి  
లక్ష్మీనరసింహస్వామి  ని  ప్రతిష్టించారట.
ఇలాంటి టూర్ కి గ్రూప్ గా వెళితే అడ్వాంటేజ్ ఎంత ఉందో ,డిజ్అడ్వాంటేజ్ కూడా అంతే ఉంది.హడావిడి గా చూసి వచ్చెయ్యాలి.ఇంకోసారి మా ఫామిలీ వరకే వెళ్ళాలి అనుకున్నాము. ఎప్పటికి కుదిరేనో !      
             




            గుడి మంటపం లోని స్థంబాల పైన చెక్కిన విగ్రహాలకు కూడా భక్తులు పూజలు చేస్తున్నారు . 



 
 

Tuesday 18 November 2014

మహానంది

 ప్రతి సంవత్సరం లానే కార్తీక మాసం లో ,సాయిబాబా గుడి వాళ్ళు శివ,వైష్ణవ గుడి సందర్శనకు ప్రోగ్రాం వేసారు.ఈ సంవత్సరం మహానంది,యాగంటి ,అహోబిలం ,మంత్రాలయం తీసుకు వెళ్ళారు. నంద్యాల కు 21 కి.మీ దూరం లో ఉన్న ఈగుడి  మొట్టమొదటగా 1500ఏళ్ళ క్రితం నిర్మించబడింది. కాలక్రమంలో అనేకసార్లు పునర్నిర్మించారు. ప్రపంచం లోనే అతిపెద్దదైన నంది విగ్రహం ఇక్కడ నంది పార్క్ లో ఉంది.ఇక్కడ ఉన్న కోనేటి లోకి నీరు ఎలా వస్తుంది అన్నది మిస్టరి.గర్భగుడి లో ఉన్న శివలింగం వద్ద నుంచి కోనేటి లోకి నీరు వస్తుంది అని అనుకోలు.కోనేటి లో నీరు చాలా స్వచ్చం గా ఉంది. ఈ గుడి ప్రాంగణం లోనే ఉన్న కామేశ్వరి అమ్మవారి  గుడి మంటపం పై కప్పు,స్తంభాల మీద చెక్కిన శిల్పాలను చూస్తే నిజం గానే  అందరూ చెప్తున్నట్టు దేవశిల్పి ఈ గుడి నిర్మాణం చేసి ఉండొచ్చు అని  నమ్మవచ్చు.మాటల్లో చెప్పలేనంత అందం గా ఉంది.నవనందుల్లో ఒకటైన వినాయక నంది ని కూడా దర్శించుకుని అహోబిలం వెళ్ళాము .

 
             ప్రవేశ ద్వారం 



 
కోనేరు లో ... 
 
 
 
 

Tuesday 11 November 2014

ఎవరి అభిప్రాయాలు వారివి

 
 



నాకు ఏడుపుగొట్టు సినిమాలంటే  పరమ చిరాకు.ఆడవాళ్ళకు ఏడుపుగొట్టు సినిమాలంటే ఇష్టం.ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారు.ఇలాంటి మాటలు ఎవరన్నా అంటే సహజం గానే ఖండిస్తాను. ఎందుకంటే నేను అలాంటి సినిమాలు ఇష్టపడను కనుక.సహజం గానే ప్రతి ఒక్కరు తమకు ఎదురైన సంఘటనలను బట్టో,తన చుట్టూ ఉన్న వారిని చూసో తమకంటూ కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకుంటారు.వాటికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారి అభిప్రాయాలను మన్నించరు.వారేదో తప్పుగా మాట్లాడారు అనుకుంటారు. 
 
పంచతంత్రం చదివినవారికి "బ్రాహ్మణుడు- నల్లమేక కథ గుర్తుండి ఉంటుంది.దొంగలు,మేకను కుక్క అని నమ్మించి  కాజేస్తారు.అబద్దానైనా పదే పదే  వల్లిస్తే అదే నిజమని బ్రమించే మనుషులకు ఈ లోకం లో కొదవ లేదు.ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నది అదే !నిజాలకంటే అబద్ధాలకే ప్రాధాన్యత ఎక్కువ.ఎదుటివారు చెప్పేదాన్ని ,పూర్తి అవగాహన లేకుండా  ఖండించటం ఎంత తప్పో ,డూ డూ బసవన్న లా తల ఊపుతూ ఆమోదించటం కూడా అంతే తప్పు.