Tuesday 24 July 2018

Coir Museum (పీచు మ్యూజియం )Kalavoor (Alappuzha)

అలెప్పీ వెళితే తప్పక చూడాల్సిన వాటిలో ఒకటి.ఎక్కువ మంది, పీచు మ్యూజియం - ఏముంటుందిలే చూడటానికి అనుకుని వెళ్లక పోవచ్చు.విషయాసక్తి ఉన్న వాళ్లకి తప్పకుండా నచ్చుతుంది . 

ఈ మ్యూజియం,కొబ్బరి పీచు పరిశ్రమ 60 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భం గా కాయిర్ బోర్డు కాంప్లెక్స్ లోనే 2014 లో కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ ప్రారంభించారు.ఈ సందర్భం గా భారత ప్రభుత్వం 60 రూపాయల నాణెం విడు దల చేసింది.



ఈ మ్యూజియం లో కొబ్బరి పీచు తో  చేసిన బొమ్మలు,పీచు తీసే యంత్రాలు,పీచు  నుంచి తాళ్లు ,కాళ్ళు తుడుచుకునే పట్టాలు తయారు చేసే యంత్రాలు ఉన్నాయి.కొబ్బరి పీచు తో చేసిన కొన్ని బొమ్మలు ...






















కనిపిస్తున్న ఇంటి నమూనా లో వాడిన తలుపులు, కిటికీ లు, గోడలు అన్నీ కొబ్బరి పీచు +ప్లై వుడ్  కాంబినేషన్ లో తయారయ్యాయి. ఇవి ఫైర్ మరియు వాటర్ ప్రూఫ్ అంట. బెంగళూరు కాయిర్ బోర్డు వారి దగ్గర మాత్రమే ప్రస్తుతం లభిస్తున్నాయి.

   
కొబ్బరికాయలు నుంచి పీచు - దాని నుంచి తాళ్లు,ఇతర వస్తువుల  తయారీ ప్రాసెస్ ... బొమ్మల తో .

మ్యూజియం చూసిన తర్వాత, దగ్గర లో ఉన్న మరారికులం బీచ్ కి వెళ్ళాము. బీచ్ కి వెళ్లే దారిలో మహాదేవ (శివుడు) గుడి ఉంది.బీచ్ నుంచి వస్తూ శివుడు ని దర్శించుకుని వచ్చాము.