Thursday 22 January 2015

బాగుంది

 
 
 
 
ఒక 5,6 నెలల క్రితం వరకు ఈ చెరువు గుర్రపుడెక్కతో నిండి ,నీరన్నది కనిపించకుండా పచ్చగా ఉండేది.చెరువుల పరిరక్షణ పధకం పుణ్యమా అని బాగుపడింది. 
 
ఇంకో సంతోషపడే విషయం ఏమిటంటే ,బస్సుల్లో పార్టిషన్ .అంతకు ముందు సాయంత్రం ఆరు తర్వాత బస్సు లో ప్రయాణం అంటే భయం వేసేది.కొంచం సెన్స్ ఉన్న బస్ డ్రైవర్ అయితే ,తాగి ఉన్నవాళ్ళను ఫ్రంట్ డోర్ నుంచి ఎక్కనిచ్చేవాడు కాదు. దాని వల్ల గొడవ.ప్రయాణికులు కలగజేసుకుని ,ఆ తాగి ఉన్నవాడిని  బస్ బాక్ డోర్ నుంచి ఎక్కించి ,ఇక బస్ స్టార్ట్ చెయ్యవయ్య అనే వరకు   డ్రైవర్ బస్ ఆపేసేవాడు.  డ్రైవర్ పట్టించుకోకుండా ఉంటే ,ఆ బస్ ఎక్కినవాడు తూలుతూ ఉంటే ,ఎక్కడ మీద పడతాడో అని భయం.ఆ కంపు కి వామిటింగ్ సెన్సేషన్ ... బస్ ప్రయాణం నరకాన్ని తలపించేది. ఇప్పుడు బస్సుల్లో పార్టిషన్ వల్ల హాయి గా ఉంది . 
 
 
 
        


Tuesday 6 January 2015

మనిషి మారలేదు

 
 

 వేషము  మార్చెనూ
 భాషను మార్చెనూ
 మోసము నేర్చెను
 అసలు తానే మారెనూ
 అయినా మనిషి మారలేదు
 ఆతని మమత తీరలెదు
 ఆయినా మనిషి మారలేదు
 ఆతని మమత తీరలేదు 
 
క్రూర మృగమ్ముల కోరలు తీసెను
 ఘొరారణ్యములు ఆక్రమించెను
  హిమలయము పై ఝండా పాతెను
 ఆకాసం లో షికారు చేసెను
 అయినా మనిషి మారలేదు
అతని కాంక్ష తీరలేదు 
 
పిడికిలి మించని హృదయములో
 కడలిని మించిన ఆశలు దాచెను
 వేదికలెక్కెను వాదము చేసెను 
 త్యాగమే మేలని బోధలు చేసెను
అయినా మనిషి మారలేదు 
అతని బాధ తీరలేదు 
ఇది 1962 లో వచ్చిన గుండమ్మ కథ చిత్రం లోని పాట . రాసినది పింగళి నాగేంద్ర . 
 
అయినా మనిషి మారలేదు ...  అతని కాంక్ష తీరలేదు 
 
నిజమే కాలంతో పాటు ,ఎన్నో మార్పులు వచ్చినా మనిషి మారలేదు 
ఒకప్పుడు ఆధిపత్యం కోసం రాజ్యాల మధ్య యుద్ధాలు జరిగితే ,ఇప్పుడు దేశాల మధ్య ... రాష్ట్రాల మధ్య ... 
ఒకప్పుడు రాజుల సొమ్ము రాళ్ళ పాలు అనేవారు . ఇప్పుడు ప్రజల సొమ్ము విగ్రహాల పాలు  
ఎంతమంది స్వామీజీ లు ,గురువులు ఉంటే వారి భక్తుల సొమ్ము - అన్ని స్తూపాలు ,విగ్రహాల పాలు 
 
ఇక బాధలు గురించి తెలియనిదేముంది ?అవి కలకాలం కళ కళ లాడుతూ ఉంటాయి :))