Monday 25 February 2013

ప్రయాణం లో పదనిసలు




ఒకానొక రోజు బస్ లో ప్రయాణిస్తున్న నాకు ,నా సహ ప్రయాణికురాలికి మధ్య జరిగిన సంభాషణ .
ఈ రోజుల్లో పిల్లలు ఎలా తయారు అయ్యారు అన్న దగ్గర్నుంచి రాజకీయాలు,అవినీతి ,ధరల పెరుగుదల మొదలైన విషయాల గురించి ఏకధాటిగా మాట్లాడారు. ఈ విధంగా ధరలు పెరిగితే సామాన్యుడు ఏం తింటాడు,ఏం బ్రతుకుతాడు అని అంటూ ఉంటే నేను ఊ కొడుతూ  బుద్ధి గా వింటూన్నాను. 
మాది వైజాగ్. మెహదీపట్నం లో ప్రార్ధనలు ఉంటె వెళుతున్నాను . నా వయసు 65 ఏళ్ళు . ఈ వయసు లో ఎందుకు అంత దూరం వెళ్ళటం అని మా అమ్మాయిలూ,మనవడు వద్దు అన్నా వెళుతున్నాను. అంతా ఆ ప్రభువే చూసుకుంటాడు .కాశీ చూసాను . ఇంకా చాలా పుణ్య క్షేత్రాలు చూసాను. కానీ నాకు ఆ ఏసు ప్రభువు ను నమ్ముకున్నాకే అంతా మంచి జరిగింది. ఇవాళ రాత్రి ఇది కావాలని కోరుకుంటే మరుసటి రోజు అది దొరికేది. ఉద్యోగం కావాలనుకున్నాను ,ఇచ్చాడు . ఇల్లు కట్టుకోవాలనుకున్నాను . కట్టుకున్నాను . ఇప్పటికే మనవాళ్ళు చాలా మంది ఆ ప్రభువు ను నమ్ముకున్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ ప్రభువు ను నమ్ముకోవాలని ప్రార్ధన చేస్తున్నాను. అందరికీ ప్రభువు ఆ ఏసు అయ్యే రోజు కోసం చూస్తున్నాను .  నీ పేరు చెప్పమ్మా . నీ కోసం కూడా ప్రార్ధన చేస్తాను. పేరు చెప్పాను.      
    
ఆ తర్వాత  సంభాషణ ప్రశ్నల పర్వం లోకి మళ్ళింది.  

ఆమె: ఉద్యోగం చేస్తున్నావా?
నేను: లేదండి . 
ఆమె:ఎందుకు చెయ్యటం లేదు ,ఉద్యోగం చెయ్యొచ్చు గా. 
నేను ఆరోగ్యం బాగోదు . 
ఆమె: ఏమిటి ప్రాబ్లం?
నేను:  *****
ఆమె: ప్రార్ధన జరిగే చోట ఒక చిన్న బాటిల్ లో నూనె అమ్ముతారు. పది రూపాయలే !ప్రొద్దున్నే మొహం కడుక్కొని మూడు చుక్కలు నోట్లో వేసుకుని ఏసు జయం అనుకుంటే చాలు ,ఇక మళ్ళీ అనారోగ్యం అంటూ ఉండదు . 
నేను:  నేను అలాంటివి అన్నీ నమ్మను అండి . 
ఆమె: ఒక్కసారి ఏసు ను నమ్ముకో . అంతా మంచే జరుగుతుంది. 
నేను ఏ దేవుడ్ని నమ్మను అండి . అయినా గీత లో మన మతం ఎంత చెడ్డ దయినా పర మతం లో కి మార కూడదు అని చెప్పారు కదా. 
ఆమె: హిందూ మతం చెడ్డదని చెప్పటం లేదు. ఏసు ని నమ్ముకుంటే మంచి జరుగుతుందని చెపుతున్నాను. 
నేను: మంచో,చెడో హిందూ మతం లో పుట్టాను ,ఆ మతం లోనే ఉంటాను ... 
ఇక మాటలు లేవు :)