Thursday 4 December 2014

 తిలక్ గారు రాసిన ఆర్తగీతం కవిత నుంచి నాకు నచ్చిన పంక్తులు కొన్ని ...



 
నా దేశాన్ని గూర్చి పాడలేను,నీ ఆదేశాన్ని మన్నించలేను
ఈ విపంచికకు శ్రుతి కలుపలేను
గత చారిత్రక యశ:కలాపమ్ము వివరింపకు .
బహుళ వీరానేక గాథాసహస్రమ్ము వినిపింపకు

ఇంక నన్ను విసిగింపకు
నేడు నేను కన్నీరు గా కరిగిన గీతికను,సిగ్గుతో రెండుగా
చీలిన వెదురు బొంగును,
మంటలో అంతరాంతర దగ్దమైన బూడిదను
 
నేను చూశాను నిజం గా మూర్తీభవత్ దైన్యాన్ని,హైన్యాన్ని
క్షుభితాశ్రు కల్లోల నీరధుల్ని,గచ్చత్ శవాకార వికారుల్ని
ఇది ఏ నాగరికతకు ఫలశ్రుతి?ఏ విజ్ఞాన ప్రకర్షకుపశ్రుతి?
ఏ బుద్దదేవుడి జన్మభూమి కి గర్వస్మృతి

ఇంక నన్ను నిర్భంధించకు నేస్తం ! ఈ రాత్రి నేను పాడలేను,
ఈ కృత్రిమ వేషాన్ని అభినయింపలేను
మానవత లేని లోకాన్ని స్తుతింపలేను
మానవుని గా శిరసెత్తుకు తిరుగలేను
ఈ నాగరికతారణ్యవాసం భరించలేను
 

No comments: