Tuesday 1 November 2016

కర్ణాటక కోవెల యాత్ర - మంగళూరు

కుక్కే నుంచి మంగళూరు కి ప్రయాణం

మంగళూరు లో మొదటగా మంగళాదేవి మందిరానికి వెళ్ళాము.అమ్మవారి పేరు తోనే ఈ ఊరు - మంగళాపురం  గా పిలువబడి ,కాలక్రమం లో మంగళూరు గా స్థిరపడింది. 9వ శతాబ్దం లో , అలుప వంశానికి చెందిన కుందవర్మన్ ఈ ఆలయాన్ని , కేరళ గుడుల నిర్మాణ శైలి లో కట్టించాడు  అని ఒక కథనం. ఇంకో కథనం ప్రకారం ,పరశురాముడు నిర్మించగా - తర్వాతి కాలం లో  కుందవర్మన్ విస్తరించాడని.






















అక్కడ్నుంచి,కుడ్రోలి గోకర్ణాథేశ్వరక్షేత్రానికి వెళ్ళాము.మొట్టమొదట నారాయణ గురు ఆధ్వర్యాన , కోరగప్ప 1912 వ సంవత్సరం లో నిర్మించారు . రెనోవేషన్ తర్వాత 1991 లో రాజీవ్ గాంధీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది.ఈ క్షేత్రంలో శివునితో పాటు గణపతి,సుబ్రహ్మణ్యస్వామి,అన్నపూర్ణ,భైరవ,శని,కృష్ణ,నవగ్రహాలమందిరాలు కూడా ఉన్నాయి.హనుమాన్ మందిరాన్ని 2007 లో నిర్మించారు . 


    












2 comments:

Arbinda said...

beautiful pic n nice description !!!

Anuradha said...

Thank you Arbinda