Thursday 11 October 2012

రామలింగేశ్వర ఆలయం - కీసరగుట్ట

రావణుని సంహరించిన తరువాత, బ్రాహ్మణ హత్యా పాపాన్ని పోగొట్టుకునేందుకు శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్టించదలుచుకుని,హనుమంతుడుని కాశీ నుంచి శివలింగాన్ని తీసుకు రావలసిందిగా కోరారు. విగ్రహాన్ని ప్రతిష్టించాల్సిన సమయం దాటిపోతున్నా హనుమంతుని జాడ లేదు.అప్పుడు ఆ పరమశివుడే స్వయం ప్రకటితమై శ్రీరామునికి,శివలింగాన్ని ప్రతిష్టించటానికి ఇచ్చారంట.ప్రతిష్టించటం పూర్తి అయిన తరువాత ఆంజనేయ స్వామి వారు 101 శివలింగాలతో వచ్చారంట. తాను వచ్చేటప్పటికే శివలింగం ప్రతిష్టమవటంతో కోపంతో తాను తెచ్చిన శివలింగాలను విసిరి వేసారంట. ఇప్పటికి గుడి చుట్టుపక్కల ప్రాంతంలో ఆ శివలింగాలు మనకు కనిపిస్తాయి.కీసరగుట్ట మీద శివాలయంతో పాటు ఆంజనేయస్వామి ఆలయం కూడా ఉంది.









 ఆంజనేయ స్వామి వారిచే విసిరి వేయబడ్డ శివలింగాలు ఈ క్రింది పిక్స్ లో చూడొచ్చు 







గుడిలో వానర సంచారమూ ఎక్కువే !



No comments: