Sunday 5 January 2014

నవగ్రహ టెంపుల్

డిసెంబర్ 22 ఉదయం 7:30 కి సికింద్రాబాద్ లో గౌహాతి ఎక్స్ప్రెస్ ఎక్కి డిసెంబర్ 24 ఉదయం  8:00 గంటలకు గౌహాతి చేరుకున్నాము.రోజంతా రెస్ట్ తీసుకుని,ఆరతి బాగుంటుంది అంటే సాయంకాలం యూనిట్ లో ఉన్న కాళీ మందిరం కు వెళ్ళాము.ఆరతి కార్యక్రమం 7:00 కు మొదలయ్యి 7:30 కి ముగిసింది.మొదట అయిదు వత్తులతో ,తర్వాత సాంబ్రాణి తో , ఆ తర్వాత వింజామర తో విసరటం ... ఆరతి మొదలయ్యినప్పటి నుంచి ముగిసే వరకు ఆపకుండా డ్రం బీట్స్ ,గంటలు మోగిస్తూనే ఉన్నారు.డ్రం బీట్స్ చాలా బాగున్నాయి.అవి వినటానికయినా రోజూ గుడికి వెళ్లాలనిపించింది.

నెక్స్ట్ డే ,చిత్రాంచల్ పర్వతం పైన ఉన్న నవగ్రహమందిరానికి వెళ్ళాము.ఈ గుడి 18వ శతాబ్దం లో అహోం రాజు రాజేశ్వర్ సింఘా కట్టించాడు.ఈ గుడి లో 9 శివలింగాలు ఉన్నాయి.ఒక్కోటి ఒక్కో గ్రహాన్ని సూచిస్తుంది.మధ్యలో ఉన్నది సూర్య గ్రహాన్ని ... చుట్టూ ఉన్నవి మిగతా గ్రహాలు . 


                  గుడి వెలుపల




గుడి లోపల 

 
 

No comments: